గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. మొత్తం 23 పతకాలు సాధించి, రాష్ట్ర ఖ్యాతిని పెంచారు. సైబరాబాద్ హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్రెడ్డికి శౌర్య పతకం, ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు దక్కాయి. అగ్నిమాపక, జైళ్ల శాఖ, హోంగార్డులకు కూడా గుర్తింపు లభించింది.