గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసిన మొంథా తుఫాను గురువారంతో కాస్త శాంతించింది. నిన్నటి నుంచే రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. ఈక్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు కీలక అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంపై మొంథా తుఫాన్ ప్రభావం తగ్గిందని.. కాకపోతే.. కొన్ని ప్రాంతాల్లో మరో రెండు రోజులు వానలు కొనసాగుతాయని చెప్పుకొచ్చింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ వివవరాలు..