తెలంగాణలో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. కుమురం భీం ఆసిఫాబాద్లోని గిన్నెధరిలో అత్యల్పంగా 6.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న మూడు నుంచి నాలుగు రోజులు కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.