తెలంగాణలోని మద్యం ప్రియులకు త్వరలో ప్రభుత్వం తక్కువ ధరకే టెట్రా ప్యాకెట్లలో మద్యం అందించేందుకు యోచిస్తోంది. కేవలం రూ.50కే 60, 90, 180 మిల్లీలీటర్ల ప్యాకెట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ లిక్కర్ టెట్రా అమ్మకాలు విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీంతో.. తొందరలోనే మందుబాబులకు శుభవార్త వినిపించే అవకాశం ఉందన్న మాట..!