బతుకమ్మ కానుకగా ఇందిరా మహిళా శక్తి పేరుతో ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పండుగ నాటికి చీరలు సిద్ధం కాకపోవడంతో పంపిణీ వాయిదా పడింది. వీటిని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఎట్టిపరిస్థితుల్లోనూ నవంబర్ 15 వరకు చీరల తయారీ పూర్తి చేసి.. పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం అధికారులు ఏర్పాట్లు మమ్మరం చేస్తున్నారు.