తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున మొత్తం 1.30 కోట్ల చీరలు పంపిణీ చేయనుంది. సిరిసిల్లలో పవర్లూమ్లపై చీరల తయారీ ముమ్మరంగా సాగుతోంది, సెప్టెంబర్ చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయదశమికి మహిళలకు చీరలు అందించనున్నారు.