తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాలకు చీరల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఇందిరా మహిళా శక్తి పేరుతో ఈ కార్యక్రమాన్ని నవంబర్ 19వ తేదీన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నారు. సుమారు 1.94 లక్షల మంది మహిళలకు ఈ చీరల పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం నవంబర్ 15వ తేదీ లోపు చీరల తయారీ పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా మహిళలకు పంపిణీ చేయనున్నారు. ఇక చీరల నాణ్యత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.