తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులను మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహించేలా ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలు.. 152 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతున్నాయి. ఇప్పుడు మరో 448 బస్సులను కొనుగోలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు కొత్త బస్సులు కొనడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సెర్ప్ సీఈఓ.. ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు.