మహిళా సాధికారత లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సమాఖ్యల కోసం అత్యాధునిక వర్క్షెడ్ల నిర్మాణానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న ఈ షెడ్లు.. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అయితే భూ సేకరణ సమస్య ఈ పథకానికి ప్రధాన అడ్డంకిగా మారింది.