తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 16వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల కానుండగా.. జనవరి 20వ తేదీన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల కోసం మార్చిలోగా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.