తెలంగాణలో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం జనవరి 26న ముగిసినా.. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యానికి కారణాలు తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 11న వాయిదా వేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టు సీరియస్గా ఉందని ఈ నోటీసులు స్పష్టం చేస్తున్నాయి.