తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండా లక్ష్మారెడ్డి (84) అనారోగ్యంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడైన లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు.