తెలంగాణ రైతులకు నిజంగా ఇది శుభవార్తే. రాష్ట్రంలో యూరియా కొరత తీరనుంది. కేంద్రం అదనంగా 1.17 లక్షల టన్నుల యూరియాను కేటాయించడంతో మొత్తం 2.87 లక్షల టన్నులు అందుబాటులోకి రానున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే 1.44 లక్షల టన్నులు చేరగా.. మిగిలిన యూరియా కూడా త్వరలో రానుంది.