తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. భారత పత్తి సంస్థ (సీసీఐ) నిబంధనల సడలింపుతో రాష్ట్రంలోని 330 జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం నుంచి కొనుగోళ్లు పునఃప్రారంభమయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఈ సమస్య పరిష్కారమై, రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఏర్పడింది.