తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. నిలిచిపోయిన రైతు భరోసా పథకాన్ని పునరుద్ధరించి, అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. పసుపు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.