తెలంగాణ రైతులకు శుభవార్త.. ఆ కష్టాలకు చెక్ పెట్టే విధంగా సర్కార్ ప్లాన్..

7 months ago 22
తెలంగాణ ప్రభుత్వం సాగులో కూలీల కొరతను తీర్చడానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని జనవరి నుండి అమలు చేయనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 101.83 కోట్లు కేటాయించి.. 1.31 లక్షల మంది రైతులకు రాయితీపై యంత్రాలు అందజేయనుంది. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు 50%, ఇతర రైతులకు 40% సబ్సిడీ లభిస్తుంది. రైతులు ఎంపిక చేసిన 16 కంపెనీల నుండి నేరుగా పనిముట్లు కొనుగోలు చేయవచ్చు. పారదర్శకత కోసం రూ. లక్ష దాటిన యంత్రాలకు జియో ట్యాగింగ్, ఏఐ టెలిమాటిక్స్ కిట్‌లు అమర్చి ఐదేళ్ల పాటు అధికారులు పర్యవేక్షిస్తారు. ఇప్పటికే 5.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఐదెకరాల లోపు ఉన్న చిన్న రైతులకే ప్రాధాన్యత ఇస్తూ జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి.
Read Entire Article