తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక వర్గాల కోసం అదనంగా 35,921 ఇళ్లను మంజూరు చేసింది. పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, అనాథలు, దివ్యాంగులు, వితంతువులు, వ్యవసాయ కార్మికులు, ఆదివాసీలకు ఈ ఇళ్ల ప్రయోజనం అందనుంది.