తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. బీసీలకు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలనే ప్రభుత్వ పట్టుదల నేపథ్యంలో.. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.