తెలంగాణలో 'దిత్వా' తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చలి తీవ్రతతో ఒక వ్యక్తి మృతి చెందగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.