ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై కొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంతగా భారీ పెట్టుబడులను సమీకరించింది. ఒక్క రోజులోనే రూ.56,300 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. ఈ మేరకు మూడు కంపెనీలతో ఒప్పందాలు జరగ్గా.. దాదాపు 10 వేలకు పైచిలుకు ఉద్యోగాలు లభించనున్నాయి.