తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. శ్రీలంక సముద్ర ప్రాంతంలోఅల్పపీడనం ఏర్పడిందని.. దాని ప్రభావంతో ఈనెల 22 నుంచి 24 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా పెరుగుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.