తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో రానున్న ఏడు రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు. ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేటతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ 42 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉండనుందని చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు తగ్గించుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.