ఆంధ్రప్రదేశ్ను తాకిన 'మొంథా' తుఫాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంది. దీని కారణంగా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని పంటను కాపాడుకోవాలని సూచనలు జారీ అయ్యాయి.