తెలంగాణలో ద్రోణి తరహా వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల తేమ ప్రభావంతో ఆగస్టు నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. కరీంనగర్కు విస్తరించే అవకాశం ఉందన్నారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.