తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రమంత్రి జయంతిభాయ్ బాంభానియా ప్రకటించారు. ఇక దేశవ్యాప్తంగా 41 లక్షలకు పైగా రేషన్ కార్డులను రద్దు చేసినట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యల్పంగా 102 కార్డులను కట్ చేసినట్లు తెలిపారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చితే.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ హయాంలో రేషన్ కార్డుల సంఖ్య పెరిగినట్లు వివరించారు. అదే సమయంలో రేషన్ సరుకుల పంపిణీని మరింత సులభతరం చేసినట్లు తెలిపారు.