తెలంగాణలో రహదారుల రూపురేఖలు మారనున్నాయి. NHAI ఆధ్వర్యంలో రూ. 10,034 కోట్ల వ్యయంతో 271 కి.మీ. మేర నాలుగు కీలక జాతీయ రహదారుల నిర్మాణం జరగనుంది. మహబూబ్నగర్- గూడెబల్లూర్, ఆర్మూర్- జగిత్యాల, జగిత్యాల- కరీంనగర్, జగిత్యాల-మంచిర్యాల హైవేల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగాన్ని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు.