తెలంగాణలో వాహన ప్రమాదాలు పెరుగుతున్నా.. మరణాలు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, సీటు బెల్టు, హెల్మెట్ వాడకం పెరగడమే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. అయితే, సైబరాబాద్, రాచకొండ పరిధిలో అధిక వేగం ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్డు భద్రతపై దృష్టి సారించి, 'ఎరైవ్ - ఎలైవ్' ప్రచారంతో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.