గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం ప్రక్షాళన కొనసాగుతోంది. తాజాగా 474 పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయగా.. వాటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 17, తెలంగాణకు చెందిన 8 పార్టీలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే జేపీ స్థాపించిన లోక్ సత్తా పార్టీని తెలంగాణలో రద్దు చేస్తూ ఈసీ షాక్ ఇచ్చింది. త్వరలో మరో 359 పార్టీలను జాబితా నుంచి తొలగించనుంది.