తెలంగాణలో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు జాతీయ రహదారులపై కృత్రిమ మేధ (AI) ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ATMS) రానుంది. ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వేలో విజయవంతమైన ఈ టెక్నాలజీని NHAI రాష్ట్రంలోనూ అమలు చేయనుంది. ఇది ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి, ప్రమాదాల నివారణకు కీలకం కానుంది.