telangana vantara mou: తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి జూ పార్కు ఏర్పాటుకు వంతారాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న ఈ పార్కుకు.. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుటుంబం ఆధ్వర్యంలోని వంతారా.. సాంకేతిక నైపుణ్యాలు, ఉత్తమ విధానాలపై మార్గదర్శకత్వం అందిస్తుంది. జంతు సంరక్షణ, పునరావాసంలో వంతారా ప్రమాణాలను తెలంగాణలో అమలు చేయనున్నారు. వంతారాతో ఒప్పందపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం.. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.