తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయి. నర్మెట సభలో సీఎం రేవంత్ రెడ్డి డబ్బులు విడుదల చేశారు. అన్నదాతల అకౌంట్లలో రేపు డబ్బులు జమ కానున్నాయి. మొదట రూ.3590 కోట్లు విడుదల చేస్తామని.. మరో 45 రోజుల్లో 2 విడతల్లో పూర్తి నిధులు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే రైతు భరోసాను రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతామని.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినా.. అది ఇంకా నెరవేరలేదు.