సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాల్లో కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గుముఖం పడుతుందని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు అందుతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.