తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో వేగం పెంచేందుకు ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సవ్యసాచి ఘోష్ను అభివృద్ధి పథకాల ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా నియమించి.. సంక్షేమశాఖ సీఎస్గా కొనసాగనున్నారు. కే. ఇలంబర్తికి పశుసంవర్ధకశాఖ అదనపు బాధ్యతలు, అనితా రామచంద్రన్కు గిరిజన సంక్షేమ శాఖలో అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇ. శ్రీధర్ జీఏడీ శాఖ అదనపు బాధ్యతలు స్వీకరించారు. యాస్మిన్ బాషా ఆయిల్ఫెడ్ ఎండీగా, జి. జితేందర్ రెడ్డి ఎస్సీ అభివృద్ధి కమిషనర్గా నియమితులయ్యారు.