ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 2,069 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. తొలివిడతగా 160.32 ఎకరాలకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అర్లి-బి పరిధిలో 58 మంది రైతుల భూములు ఇందులో ఉన్నాయి. కచ్కంటి, టాక్లి ప్రాంతాల్లో మరికొంత భూమికి నోటిఫికేషన్ సిద్ధమవుతోంది. 60 రోజుల్లో అభ్యంతరాలు తెలపాలని అధికారులు సూచించారు.