తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడెంలలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ముఖ్యంగా వరంగల్ మామునూరులో భూసేకరణ పూర్తయి, నిధులు విడుదలయ్యాయి. ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ అధికారిని నియమించారు. రామగుండం నివేదిక త్వరలో రానుంది. ఈ ప్రాజెక్టులు తెలంగాణకు కొత్త ఊపునివ్వనున్నాయి.