నల్గొండ జిల్లా దేవరకొండ పర్యటనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో దేవరకొండలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ఇక్కడ 14 వేలు, నల్గొండ జిల్లాలో లక్ష కార్డులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని.. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.