తెలంగాణలో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 88 శాతం భూసేకరణ పూర్తయిందని, పెండింగ్లో ఉన్న భూసేకరణను త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. త్వరలోనే నిర్వాసితులకు పరిహారం చెల్లించే ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.