హైదరాబాద్-గోవా ప్రయాణికులకు శుభవార్త. వికారాబాద్-కొడంగల్ మీదుగా కృష్ణా రైల్వే స్టేషన్ వరకు కొత్త లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.438 కోట్లతో 845 హెక్టార్ల భూసేకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుతో సికింద్రాబాద్- రాయచూరు మధ్య దూరం 100 కి.మీ తగ్గుతుంది, ప్రయాణం సులభతరం అవుతుంది.