సికింద్రాబాద్-కాజీపేట మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. రూ. 2,837 కోట్లతో 110 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ విస్తరణతో రైళ్ల వేగం, సంఖ్య గణనీయంగా పెరిగి, రవాణా సామర్థ్యం మెరుగుపడుతుంది.