తెలంగాణలో కొత్తగా రెండు రైల్వే లైన్లు అందుబాటులోకి రానున్నాయి. డోర్నకల్-గద్వాల, డోర్నకల్-మిర్యాలగూడ లైన్ల పనులకు సంబంధించిన డీపీఆర్లు తుదిదశకు చేరుకున్నాయి. ఆగస్టు నెలాఖరుకు డీపీఆర్లు రైల్వే బోర్డుకు చేరనున్నాయి. ఈ ప్రాజెక్టులు ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలను కలుపుతాయి. ఈ లైన్లు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.