కొమురవెల్లి మల్లన్న సన్నిధికి త్వరలో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన బ్రాడ్ గేజ్ లైన్ పూర్తయితే, భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. సికింద్రాబాద్-సిద్దిపేట సెక్షన్ను పరిశీలించిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం.. కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.