తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం రెండు పథకాలను తాజాగా ప్రారంభించింది. 'ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన', 'రేవంత్ అన్న కా సహారా' అనే రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల ద్వారా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, అనాథలు, ఫకీర్, దూదేకుల వంటి వర్గాల వారికి ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది, దరఖాస్తులు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 6 వరకు స్వీకరించబడతాయి.