తెలంగాణలో వానాకాలం సాగు కీలక దశకు చేరుకున్న సమయంలో తొమ్మిది జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం లోటు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆయా జిల్లాల్లో నేలలో తేమ తగ్గి పంటలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నెలాఖరులో ఏర్పడే వాతావరణ వ్యవస్థ వర్షాలను మెరుగుపరిచే అవకాశం ఉందని వ్యవసాయ వర్సిటీ వీసీ అల్దాస్ జనయ్య తెలిపారు. ఆ వర్షాలపైనే సాగు ఆధారపడి ఉంటుందని చెప్పారు.