నంద్యాల: సోషల్ మీడియాలో పరిచయం.. కలుద్దామని పిలిపించి దారుణం..

49 minutes ago 2
నంద్యాలలో ఇటీవల జరిగిన దోపిడీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కొద్దిమొత్తంలో నగదు, మొబైల్ ఫోన్, ఐరన్ రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడికి సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయమైన యువకుడు.. ఓ చోట కలుద్దామని నమ్మించాడు. తీరా అక్కడకు వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురి సాయంతో అతనిపై దాడి చేసి డబ్బులు, ఫోన్ లాక్కుని పరారైనట్లు పోలీసులు వివరించారు.
Read Entire Article