తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తగ్గాయి. రానున్న నాలుగు రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.