తెలంగాణలో చలి చంపేస్తోంది! చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమురంభీం జిల్లాలో 7.4 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పొగమంచుతో పాటు చలిగాలులు కూడా పెరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు.