land titles to assigned landless farmers: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వరుస శుభవార్తలు అందించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా భూమిలేని నిరుపేద రైతులకు అసైన్డ్ భూములపై హక్కు కల్పిస్తూ, వారికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. జూన్ 2న దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణిలో పొరపాట్లు జరగకుండా చూడాలని, గిరిజనులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతికి తావులేకుండా చూడాలని ఆదేశించారు.