తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను దశలవారీగా పెంచాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. తొలి విడతలో 20 శాతం పెంపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం నివేదిక మే 10 తర్వాత రానుండటంతో.. కొత్త ధరల అమలుకు మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఈ ప్రకటనల విషయంలో తనను సంప్రదించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉండటం, అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది.