Telangana Today Weather: తెలంగాణలో బుధవారం నుంచి చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో 5 రోజులు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తగ్గుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం పూట ప్రయాణాలు చేసే వారు సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది అంటున్నారు.