తెలంగాణలో ప్రాంతీయ విమాన అనుసంధానం పెంపు కోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ప్రతిపాదిత ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం రూ.40.53 లక్షల నిధులు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కు మంజూరు చేసింది. ఇప్పటికే వరంగల్లోని మమ్నూరు, ఆదిలాబాద్లో విమానాశ్రయాల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.